అక్షరటుడే, బాల్కొండ: Pre Primary Classes | తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బాల్కొండ (Balkonda) మండలానికి నాలుగు ప్రీ-ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్లు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు.
మండలంలోని చిట్టాపూర్, ప్రేమ్నగర్, జలాల్పూర్, వన్నెల్-బి ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం కానుండగా, నాగపూర్ పాఠశాలలో కూడా ఈ తరగతులు కొనసాగనున్నాయి. ప్రతి పాఠశాలకు రూ.లక్ష మౌలిక వసతుల నిధిని కేటాయించడంతో పాటు ప్రత్యేక ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
Pre Primary Classes | పాఠ్య పుస్తకాల పంపిణీ

నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ సరఫరా చేసినట్లు ఎంఈఓ బట్టు రాజేశ్వర్ తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో నిర్వహించిన కార్యక్రమంలో 5,683 పాఠ్యపుస్తకాలు, 21,039 నోట్బుక్స్ను ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Armoor Theft Case | బాబాయి ఇంట్లో చోరీ చేయించిన వ్యక్తి.. ముగ్గురి అరెస్ట్


