అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Armoor Theft Case | ఆర్మూర్ దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. వారి నుంచి రూ.31.48 లక్షల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.
ఆర్మూర్ పట్టణంలో మే 24న చోరీ జరిగింది. ఈ కేసులో రూ.41,31,500 విలువైన బంగారం, వెండి, నగదు చోరీ అయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం 9 గంటలకు, ఆర్మూర్ నగరంలోని బ్రాహ్మణపల్లి (Brahmanapalli) క్రాస్ రోడ్డు వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా చోరీ చేసిన వ్యక్తులుగా తేలింది.
Armoor Theft Case | వేములవాడ వెళ్లగానే..
ఆర్మూర్ నగరానికి చెందిన విజయ్ అగర్వాల్ అనే వ్యక్తి తన బాబాయ్ ఇంట్లో దొంగతనం చేయడానికి ఒక పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం మరో ముగ్గురితో బేరం కుదుర్చుకున్నాడు. ఆర్మూర్ నగరంలోని మహాలక్ష్మి కాలనీలో గల తన బాబాయ్ కుటుంబ సభ్యులు అందరూ వేములవాడ వెళ్లగా వారి ఇంట్లో సల్మాన్ ద్వారా విలువైన బంగారం వెండి నగదును దొంగతనం చేయించాడు. నిందుతులు విజయ్ అగర్వాల్, హైదరాబాద్ నగరంలోని బంజరాహిల్స్కు చెందిన సల్మాన్ ఖాన్, బంజరాహిల్స్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మంజల్ సాయి కుమార్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో నిందితుడు శ్రీహరి పరారీలో ఉన్నారని వెల్లడించారు.
Armoor Theft Case | స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితుల నుంచి పోలీసులు 590 గ్రాముల బంగారం, రెండు వెండి లక్ష్మి బిళ్లలు 300 గ్రాములు, వెండి ప్లేట్, రూ.19,33,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తును తీసుకోవడానికి నిందితులు ఆర్మూర్లోని బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్డు వద్దకు రాగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు. చోరీ చేసిన సొమ్ములో సల్మాన్ తన అవసరాలకు రూ. లక్ష వాడుకోగా, మంజల్ సాయి కుమార్ రూ.83,500 వాడుకున్నాడు. పరారీలో ఉన్న శ్రీహరి రూ.8 లక్షలు ఉన్నాయని సీపీ తెలిపారు. విజయ్ అగర్వాల్ గతంలో పలు కేసులలో నిందితుడిగా ఉండటంతో అతనిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ తెరిచారు. కేసును ఛేదించడంలో ఏసీపీ ఆర్మూర్ జె. వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, సాయినాథ్, అమరేందర్, కిరణ్ కుమార్, సతీష్, అశోక్, అన్వేష్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.
ఇది కూడా చదవండి..: Velpur VDC | సాంఘిక బహిష్కరణ చేశారని గంగపుత్రుల ఆవేదన.. వీడీసీపై కలెక్టర్కు ఫిర్యాదు


