అక్షరటుడే, కామారెడ్డి: Farmer Death Incident | సొంత వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావిలో కాలు జారిపడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్ మండల (Sadasivanagar Mandal) కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.
Farmer Death Incident | విషాదఛాయలు
గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ జోగిని లింగం(50) ప్రతిరోజు మాదిరిగానే ఆదివారం రాత్రి పొలం దగ్గరికి వెళ్లాడు. ఉదయం అయినా ఇంకా తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్ద అంతటా వెతికారు. ఎక్కడా లింగం జాడ కనిపించలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పొలం వద్ద ఉన్న బావి వద్ద కాలు జారిన ఆనవాళ్లు కనిపించడంతో బావిలో వెతకగా లింగం మృతదేహం లభ్యం అయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లింగం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి..: Travels Bus Accident | ట్రావెల్స్ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు..

