అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Presidents | కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు యూత్ కాంగ్రెస్(Congress Party) అధ్యక్షులను నియమించారు. యూత్ కాంగ్రెస్ (Youth Congress) జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
Youth Congress Presidents | అధిష్టానం ఆదేశాల మేరకు..
ఏఐసీసీ యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి సయ్యద్ ఖాలిద్ అహ్మద్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు(Mandal President) చేపట్టినట్టు మధుసూదన్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి(Kamareddy Congress) అధ్యక్షుడిగా అజ్మత్, కామారెడ్డి మండల అధ్యక్షుడిగా హన్మాండ్ల రాంకుమార్, భిక్కనూరు మండల అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్, రాజంపేట అధ్యక్షుడిగా టి.ప్రభాకర్ గౌడ్, బీబీపేట మండల అధ్యక్షుడిగా ఎం.మహేష్, దోమకొండ అధ్యక్షుడిగా పిన్నం నాగేంద్ర వర్మ, పాల్వంచ అధ్యక్షుడిగా సమరసింహా రెడ్డి, మాచారెడ్డి అధ్యక్షుడిగా రాజారెడ్డిలను (Political Appointments) నియమించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా నియామకమైన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, యువతను ఏకం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా ఇన్ఛార్జీల పర్యవేక్షణలో వీరంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తోడ్పడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: India MIRV Missile|ఒకే క్షిపణి.. ఎన్నో లక్ష్యాలు.. రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.

