అక్షరటుడే, నాగర్ కర్నూల్: RTC Strike | తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల (RTC workers) నిరసనలు కల్వకుర్తిలో హింసాత్మకంగా మారాయి. కల్వకుర్తి ఆర్టీసీ డిపో (Kalvakurthi RTC Depot) ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులు, ప్రైవేట్ డ్రైవర్లు బస్సులు నడపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
RTC Strike | డ్రైవర్పై కారంతో దాడి:
తాము కడుపు మండి సమ్మె చేస్తుంటే, మీరు బస్సులు నడుపుతారా అంటూ కార్మికులు ప్రైవేట్ డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహం తట్టుకోలేక ఓ మహిళా కార్మికురాలు ప్రైవేట్ బస్సు డ్రైవర్ కళ్లలో కారం చల్లింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసుల కేసు నమోదు:
నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ డ్రైవర్ (Private Driver)పై దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు, తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: TGSRTC Strike | ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి.. సమ్మెకు మద్దతు తెలిపిన బీజేపీ

