Sonam Raghuvanshi Bail | హనీమూన్​ మర్డర్​ కేసు.. సోనం రఘువంశీ బెయిల్​ రద్దు

మేఘాలయ హనీమూన్​ మర్డర్​ కేసులో నిందితురాలు సోనమ్​ రఘువంశీకి మంజూరైన బెయిల్​ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sonam Raghuvanshi Bail | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్​ మర్డర్​ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

ఈ కేసులో నిందితురాలు (సోనం) బెయిల్‌పై బయట ఉండటంతో విచారణకు ఆటంకం కలగవచ్చని జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరాళేలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఆరు నెలల్లోపు విచారణ పూర్తి కాకపోతే, సోనం విచారణ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. సోనమ్‌పై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మూడు వారాల్లోగా లొంగిపోవాలని కోర్టు సోనమ్‌ను ఆదేశించింది.

Sonam Raghuvanshi Bail | అసలు ఏం జరిగిందంటే..

రాజా, సోనమ్ గత ఏడాది మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న వారు మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లారు. మూడు రోజుల తర్వాత వారు అదృశ్యం అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 10 రోజుల తర్వాత జూన్ 2న రాజా మృతదేహం ఒక లోయలో లభించడంతో హత్య కేసు దర్యాప్తుగా మారింది. సోనమ్​ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఆమె కూడా తప్పిపోయినట్లు నటించింది.

Sonam Raghuvanshi Bail | షిల్లాంగ్ జిల్లా జైలులో..

జూన్ 7 రాత్రి ఘాజీపూర్‌లోని ఒక ‘ఢాబా’ వద్ద సోనమ్ అపస్మారక స్థితిలో కనిపించింది. చికిత్స కోసం ఆమెను ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించగా, అక్కడ ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఆ తర్వాత సోనమ్ ప్రియుడు రాజ్ సింగ్ కుష్వాహాను కూడా పోలీసులు అరెస్టు చేశారు.షిల్లాంగ్ జిల్లా జైలులో సుమారు 10 నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం బెయిల్ రద్దు చేసింది.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi Demands | యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే.. మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *