అక్షరటుడే వెబ్డెస్క్: Tamil Nadu Delimitation | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం వరుసగా కీలక తీర్మానాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రగీతం, నీట్ పరీక్షలపై తీర్మానాలు చేయగా.. తాజాగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్)పై మరో తీర్మానాన్ని తీసుకువచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన డీలిమిటేషన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ప్రభుత్వం మద్దతు తెలిపింది. అయితే, ప్రస్తుతమున్న 543 లోక్సభ స్థానాల ప్రాతిపదికనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
Tamil Nadu Delimitation | పునర్విభజన జరిగితే తీవ్ర నష్టం..
కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీఎం విజయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కేంద్రం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచిన ఆయన.. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్యను అలాగే కొనసాగించాలని, ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం కేటాయించిన సీట్లను శాశ్వతం చేయాలని కోరారు. అదేవిధంగా, రాష్ట్ర శాసనసభలు , చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tamil Nadu Delimitation | నీట్ అంశంపై కొనసాగుతున్న చర్చ..
మరోవైపు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా పార్లమెంటు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో 543 లోక్సభ స్థానాలను 816కి పెంచేలా డీలిమిటేషన్ ప్రతిపాదనలపై అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
When Tamil Nadu’s representation is at stake, silence is not an option. Vijay has taken a clear stand against the threat of delimitation. 🔥#CMVijay pic.twitter.com/NYPsBDFnmI
— 🔥 (@Mugam_Moodi) August 12, 2026
ఇది కూడా చదవండి: Nandipet CCTV Cameras | నిఘా నేత్రాలతో గ్రామాలకు భద్రత..