అక్షరటుడే, వెబ్డెస్క్: TPCC District Incharges | తెలంగాణ Telangana ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC).. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, జిల్లాల వారీగా మీడియా సమన్వయాన్ని పర్యవేక్షించేందుకు 26 మంది పీసీసీ అధికార ప్రతినిధులకు (PCC Spokespersons) జిల్లా ఇన్ఛార్జి / సమన్వయకర్తల TPCC District Incharges బాధ్యతలను కేటాయించింది. ఈ మేరకు పీసీసీ సమన్వయకర్తల జాబితాను అధికారికంగా విడుదల చేసింది.
TPCC District Incharges | జిల్లాల వారీగా పీసీసీ అధికార ప్రతినిధులు వీరే..
- ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల సమన్వయకర్తగా ఎ.బి. శ్రీనివాస్ వ్యవహరిస్తారు.
- మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల బాధ్యతలను జనక్ ప్రసాద్ పర్యవేక్షిస్తారు.
- నిర్మల్ జిల్లా ఇన్ఛార్జిగా యోగేష్ రెడ్డి నియామకమయ్యారు.
- జగిత్యాల జిల్లా సమన్వయకర్తగా ఎం. కమలాకర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
- నిజామాబాద్ జిల్లా పీసీసీ అధికార ప్రతినిధిగా ఇందిరా శోభన్ పోషాల వ్యవహరిస్తారు.
- హనుమకొండ, వరంగల్ జిల్లాల ఇన్ఛార్జిగా కె. మానవత రాయ్ నియమితులయ్యారు.
- మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలను మేడి రవిచంద్రకి కేటాయించారు.
- సంగారెడ్డి, మెదక్ జిల్లాల సమన్వయకర్తగా సత్యం శ్రీరంగం బాధ్యతలు స్వీకరిస్తారు.
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాధ్యతలను కల్వ సుజాత చూసుకుంటారు.
- కరీంనగర్, సిద్దిపేట జిల్లాల అధికార ప్రతినిధిగా దామోదర్ అవేల్లి వ్యవహరిస్తారు.
- వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా డాక్టర్ కొణగాల మహేష్ నియామకమయ్యారు.
- జనగామ జిల్లా సమన్వయకర్తగా నూక కిరణ్ యాదవ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
- రంగారెడ్డి జిల్లా పీసీసీ ప్రతినిధిగా బండారు శ్రీకాంత్ వ్యవహరిస్తారు.
- మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల బాధ్యతలను జి. లోకేష్ యాదవ్కి అప్పగించారు.
- జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల ఇన్ఛార్జిగా షేక్షావలి ఆచారి నియమితులయ్యారు.
- నాగర్కర్నూల్ జిల్లా సమన్వయకర్తగా బండి సుధాకర్ వ్యవహరిస్తారు.
- సూర్యాపేట జిల్లా బాధ్యతలను డి. వెంకటరమణ చూసుకుంటారు.
- యాదాద్రి భువనగిరి జిల్లా పీసీసీ ఇన్ఛార్జిగా బొజ్జ సంధ్యారెడ్డి బాధ్యతలు చేపడతారు.
- నల్గొండ జిల్లా సమన్వయకర్తగా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి నియామకమయ్యారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యతలను మద్ది శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షిస్తారు.
- ములుగు జిల్లా ఇన్ఛార్జిగా డాక్టర్ రియాజ్ వ్యవహరిస్తారు.
- ఖమ్మం జిల్లా పీసీసీ అధికార ప్రతినిధిగా ఎ. జ్ఞాన సుందర్ నియామకమయ్యారు.
- హైదరాబాద్ జిల్లా బాధ్యతలను సయ్యద్ నిజాముద్దీన్కి కేటాయించారు.
- సికింద్రాబాద్ నియోజకవర్గ / జిల్లా ఇన్ఛార్జిగా గౌరి సతీష్ వ్యవహరిస్తారు.
- ఖైరతాబాద్ ప్రాంతపు బాధ్యతలను చానగాని దయాకర్కి అప్పగించారు.
- కామారెడ్డి జిల్లా సమన్వయకర్తగా జహీర్ అక్తర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.