Tungabhadra Crest Gates | తుంగభద్ర 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం

తుంగభద్ర డ్యామ్​ కొత్త గేట్లను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం ఉదయం ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tungabhadra Crest Gates | తుంగభద్ర డ్యామ్​ కొత్త గేట్లను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం ఉదయం ప్రారంభించారు. రూ.51 కోట్లతో రికార్డు స్థాయిలో 6 నెలల్లో 33 కొత్త క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు.

తుంగభద్ర ప్రాజెక్ట్​ 19వ గేటు గతంలో కొట్టుకుపోయింది. దీంతో ఎన్​డీఎస్​ఏ అధికారులు డ్యామ్‌ను పరిశీలించారు. అన్ని గేట్లను మార్చాలని సూచించారు. ఎన్​డీఎస్​ఏ సూచన మేరకు అధికారులు ఆరు నెలల్లో 33 కొత్త క్రస్ట్​ గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని గురువారం కర్ణాటక, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్​, రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

Tungabhadra Crest Gates | 3 గంటలకు తిరుగు పయనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులతో కర్ణాటకకు వెళ్లారు. హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను ప్రారంభించారు. గేట్ల ప్రారంభానికి ముందు హోసపేట ఐఆర్బీ అతిథి గృహంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం మునిరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. సభ ముగిశాక మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

ఇది కూడా చదవండి..: Bakery Fire Accident | బేకరీలో అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *