అక్షరటుడే వెబ్డెస్క్: Vande Bharat Accident | ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం పరిధిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. పట్టాలపైకి అకస్మాత్తుగా పశువులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Vande Bharat Accident | గంటపాటు నిలిచిన రైలు..
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు, హిందూపురం – దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యకు చేరుకోగానే పట్టాలపైకి ఒక్కసారిగా ఒక గేదె వచ్చింది. రైలు వేగంగా ఉండటంతో లోకో పైలట్ ఆపగలిగే లోపే ఆ గేదెను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ సుమారు గంటపాటు అక్కడే నిలిచిపోయింది.
Vande Bharat Accident | రైలును పునరుద్ధరించిన సిబ్బంది..
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు చేపట్టారు. రైలుకు ఎలాంటి పెద్ద నష్టం జరగకపోవడంతో, అంతా సవ్యంగా ఉందో లేదో తనిఖీ చేసిన అనంతరం రైలును తిరిగి గమ్యస్థానానికి పంపించారు. దీంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
హిందూపురం వద్ద బర్రెను ఢీకొన్న వందేభారత్
హిందూపురం – దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపైకి వచ్చిన బర్రెను ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందేభారత్
ఎక్స్ ప్రెస్ ఢీకొంది.ఈ ఘటనతో రైలు సుమారు గంటపాటు అక్కడే నిలిచిపోయింది.
అనంతరం రైల్వే సిబ్బంది చర్యలు తీసుకుని రైలును… pic.twitter.com/rTSqCGqIj3
— greatandhra (@greatandhranews) June 7, 2026
ఇది కూడా చదవండి: Kukatpally Pub Raid | పబ్లో గలీజ్ దందా.. మేనేజర్ అరెస్ట్
