Vande Bharat Accident | ట్రాక్‌పైకి వచ్చిన గేదె.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం పరిధిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. పట్టాలపైకి అకస్మాత్తుగా పశువులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే  వెబ్‌డెస్క్: Vande Bharat Accident | ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం పరిధిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. పట్టాలపైకి అకస్మాత్తుగా పశువులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Vande Bharat Accident | గంటపాటు నిలిచిన రైలు..

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు, హిందూపురం – దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్యకు చేరుకోగానే పట్టాలపైకి ఒక్కసారిగా ఒక గేదె వచ్చింది. రైలు వేగంగా ఉండటంతో లోకో పైలట్ ఆపగలిగే లోపే ఆ గేదెను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు గంటపాటు అక్కడే నిలిచిపోయింది.

Vande Bharat Accident | రైలును పునరుద్ధరించిన సిబ్బంది..

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు చేపట్టారు. రైలుకు ఎలాంటి పెద్ద నష్టం జరగకపోవడంతో, అంతా సవ్యంగా ఉందో లేదో తనిఖీ చేసిన అనంతరం రైలును తిరిగి గమ్యస్థానానికి పంపించారు. దీంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి:  Kukatpally Pub Raid | పబ్​లో గలీజ్​ దందా.. మేనేజర్​ అరెస్ట్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *