అక్షరటుడే, వెబ్డెస్క్: Windows 10 ESU | విండోస్ 10 వాడుతున్న వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ ఒక మంచి వార్తను అందించింది. విండోస్ 10 కోసం ‘ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్’ (ESU) ప్రోగ్రామ్ను మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల 2027 అక్టోబర్ వరకు విండోస్ 10 వినియోగదారులకు సెక్యూరిటీ అప్డేట్లు అందుబాటులో ఉండనున్నాయి.
Windows 10 ESU | ఎందుకీ నిర్ణయం?
చాలా మంది వినియోగదారులు విండోస్ 11కు మారలేక లేదా కొత్త పీసీని కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ ఈ సదుపాయాన్ని పొడిగించింది. ఈ గడువు అక్టోబర్తో ముగియాల్సి ఉండగా, ఇప్పుడు దానికి అదనంగా మరో ఏడాది సమయం లభించింది. ఈ అప్డేట్లు పొందాలనుకునే వారు మైక్రోసాఫ్ట్ అందించే ‘ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్’ (ESU) ప్రోగ్రామ్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
Windows 10 ESU | ఏమి లభిస్తాయి?:
ఈ ప్రోగ్రామ్ ద్వారా కేవలం కంప్యూటర్ భద్రతకు సంబంధించిన (సెక్యూరిటీ) అప్డేట్లు మాత్రమే వస్తాయి. విండోస్ 10 వాడే వారికి కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు లేదా ఇతర నాన్-సెక్యూరిటీ అప్డేట్లు రావు. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్లో చేరిన యూజర్లు మళ్ళీ కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు. మైక్రోసాఫ్ట్ తన వినియోగదారులను విండోస్ 11కు ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విండోస్ 10లో కొనసాగుతున్న లక్షలాది మందికి ఈ పొడిగింపు ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది.
ఇది కూడా చదవండి..: June 28 Gold Prices | బంగారం, వెండి ధరలు మరింత దిగిరానున్నాయా..? బులియన్ మార్కెట్లో మ్యాజిక్ జరగనుందా..?