అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Strengthening | యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి గ్రామస్థాయి నుంచి యువజన కాంగ్రెస్ను (Youth Congress ) బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి ఖలీద్ అహ్మద్ సూచించారు. శుక్రవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలో నిర్వహించిన జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Youth Congress Strengthening | సంస్థాగత బలోపేతానికి..
జిల్లాలో యువజన కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం, ఐవైసీ యాప్లో గ్రామ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఐవైసీ యాప్ ద్వారా గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని నాయకులు కోరారు. జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్దార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సందీప్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ChatGPT for Teens | ఓపెన్ఏఐ కీలక నిర్ణయం. టీనేజర్ల కోసం అద్భుత ఫీచర్!