ACB Case | ఇంటి పర్మిషన్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఇంటి పర్మిషన్​ కోసం లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | ఇంటి పర్మిషన్​ కోసం లంచం డిమాండ్​ చేసిన పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లాలో చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా జన్నారం (Jannaram) మండలం లింగాయిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. దాని పర్మిషన్, ఇంటి నంబర్​ కోసం పంచాయతీ కార్యదర్శి జె. వరలక్ష్మిని కలిశాడు. దీని కోసం ఆమె రూ.20 వేల లంచం డిమాండ్​ చేసింది. చర్చల అనంతరం ఆ మొత్తాన్ని రూ.13 వేలకు తగ్గించింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి నేరుగా డబ్బులు తీసుకోలేదు. మరో పంచాయతీ కార్యదర్శి లావణ్య ఫోన్‌పే అకౌంట్​కు డబ్బులు పంపాలని సూచించింది. దీంతో ఫిర్యాదుదారు ఆమె చెప్పిన నంబర్​కు రూ.13 వేలు పంపించాడు. ఈ సమయంలో ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ACB Case | మారని తీరు

రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. కారోబార్​ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. పనుల కోసం వచ్చే వారిని పైసల కోసం వేధిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఇంటి పర్మిషన్​, డెత్ సర్టిఫికెట్​, ఇతర పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు భారీగా డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే పనులు చేయకుండా కొర్రీలు పెడుతున్నారు.

దీనిని కూడా చదవండి : Rayadurgam Land Price | ఎకరాకు రూ.264 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *