అక్షరటుడే, ఇందూరు: PCC Chief Telangana | పీపీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్పై (Mahesh Kumar Goud) వ్యక్తిగత దాడిని జిల్లా డీసీసీ తీవ్రంగా ఖండిస్తోందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
PCC Chief Telangana | కాంగ్రెస్ అభివృద్ధికి కృషి
ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ (Congress Telangana) అభివృద్ధికి పీసీసీ చీఫ్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. కాని ఓ టీవీ ఛానల్లో ఆయనను ఒక విఫల్ పీసీసీ చీఫ్గా చూపించడానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 20 ఏళ్లుగా ఇలాంటి వ్యక్తిగత దాడి ఏ పీసీసీ అధ్యక్షుడి మీద జరగలేదన్నారు. ఆయనను టార్గెట్ చేయడంలో అర్థం లేదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికార(BC Leadership) కాంక్ష ఇటీవలి కాలంలో తారాస్థాయికి చేరుకుందన్నారు. సమీప భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
PCC Chief Telangana | బీసీ నేతపై దాడిని ఖండిస్తున్నాం
మహేష్ గౌడ్ను రేవంత్ రెడ్డి (Cm revanth Reddy) తన కొలువులో చేర్చుకుని.. అవసరమైతే బీసీ కోటలో డిప్యూటీ సీఎం పదవిని అప్పచెబుతారనే ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్గా ఫెయిల్ అయ్యారని కొన్ని ఛానళ్లు బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు. ఒక బలమైన బీసీ నేత మీద జరుగుతున్న ఈ విషపు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని..మహేష్ గౌడ్కు జిల్లా కాంగ్రెస్ తరపున అన్నివిధాలుగా మద్దతుగా నిలబడతామన్నారు. పార్టీలు వేరైనా.. అధికారంలో ఉన్నా లేకున్నా అందరికీతోనూ సఖ్యతగా ఉండే ఆయనపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.


