అక్షరటుడే, వెబ్డెస్క్ : CSR Support Schools | ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన కోసం ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. సీఎస్ఆర్ నిధులతో బడులను అభివృద్ధి చేయనున్నాయి. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయి.
కార్పొరేట్ సంస్థలు రహేజ గ్రూప్, రాంకీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధులతో సర్కార్ బడుల్లో వసతులు కల్పించడానికి ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఆయా సంస్థల ప్రతినిధులు శనివారం సీఎంతో సమావేశం అయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఒక కొత్త సమీకృత ప్రాంగణాన్ని నిర్మించడానికి రాంకీ ఫౌండేషన్ (Ramky Foundation) రూ.19.66 కోట్లు అందించనుంది. ఇది ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం కావడం గమనార్హం. మహేశ్వరం మండలంలోని తుక్కుగూడలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధునీకరణ కోసం రూ.10.4 కోట్లు అందించనుంది.
CSR Support Schools | రూ.50 కోట్లతో..
రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని కొండాపూర్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కె రహేజా గ్రూప్ రూ.50.50 కోట్లు నిధులు సమకూరుస్తుంది. ఉప్పల్లోని సుభాష్ నగరలో ఎంపీపీఎస్ పాఠశాలలో వసతుల కల్పనకు యశోద ఫౌండేషన్ రూ.12.20 కోట్లు అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయా సంస్థలు ఒప్పంద పత్రాలు అందించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి యోగిత రాణా, సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Ponguleti Comments | బీఆర్ఎస్లో హరీశ్రావు ఫ్యూచర్ ఏంటో.. పొంగులేటి కౌంటర్


