Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు మృతి..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు మృతి చెందాయి. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని అడ్లూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Kamareddy Train Accident | అడ్లూర్​ గ్రామానికి చెందిన..

గ్రామానికి చెందిన కుర్మ ఆరెల్లి లక్ష్మి తన గొర్రెల మందను తీసుకుని ప్రతిరోజు మాదిరిగానే గ్రామ శివారులో మేపడానికి వెళ్లింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ (Nizamabad) వైపు వెళ్తున్న రైలు డ్రైవర్ గొర్లను చూసి హారన్ కొట్టాడు. దీంతో బెదిరిన సుమారు 19 గొర్లు రైలు కింద పడి మృతి చెందాయి. దీంతో బాధిత రైతుకు సుమారు రూ.లక్షన్నర వరకు ఆస్తి నష్టం కలిగింది. ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

ఇది కూడా చదవండి..: Grain procurement issues | అన్నదాత ఆక్రోషం.. రోడ్డుపై ధాన్యం బస్తాలు తగలబెట్టి నిరసన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *