అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Development | ఎమ్మెల్యే మదన్మోహన్ సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ మత్తమాల భాగ్యవతి తెలిపారు. పట్టణంలోని ఏడో వార్డులో ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
Yellareddy Development | నిధులు మంజూరు
ఆమె మాట్లాడుతూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) సహకారంతో పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మదన్మోహన్ పట్టణ కేంద్రంలోని సమస్యలను తెలియజేయగానే వెంటనే స్పందించి నిధులను మంజూరు చేశారని పేర్కొన్నారు. రూ.1.74 కోట్ల నిధులతో ఏడో వార్డులో సీసీ రోడ్డును పనులు ప్రారంభించామన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ గౌడ్, కౌన్సిలర్లు గాదె తిరుపతి, సయ్యద్ గఫర్, రఫిక్, తమ్మల గాయత్రి, శ్యామ్, కో ఆప్షన్ మెంబర్లు పప్పు వెంకటేశం, అరుణ, కాంగ్రెస్ నాయకులు ప్యాలాల రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Pre Primary Classes | ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభం


