అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: GGH Nizamabad | ఇంటర్న్లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని, ఆస్పత్రి నిబంధనలు, విధులు, వైద్య నైతికతను తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ మోహన్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన ఇంటర్న్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్య పూర్తి చేసి ప్రజాసేవలో అడుగుపెడుతున్న ఈ దశలో బాధ్యత, క్రమశిక్షణ, వైద్య నైతిక విలువలు పాటించాలని సూచించారు.
GGH Nizamabad | వివిధ అంశాలపై అవగాహన
జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగ మోహన్ మాట్లాడుతూ ఇంటర్న్లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ శ్రీకాంత్, డా. రవికిరణ్, డా. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. వైస్ ప్రిన్సిపాళ్లు డా. కె.జె.కిషోర్ కుమార్, డా. జె.తిరుపతి రావు, డా. విజయ్ కుమార్, డా. అరుణ రేఖ, డా. సలీం, డా. రమణ, డా. ఇమ్రాన్, డా. శివకృష్ణ తమ తమ విభాగాల్లో ఇంటర్న్ల విధులు, బాధ్యతలు, రోగుల సంరక్షణ విధానం, అత్యవసర సేవలు, మెడికో-లీగల్ అంశాలు, వైద్య నైతిక విలువలు, ఆస్పత్రి సేవా ప్రమాణాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu | గోదావరి పుష్కర పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి


