అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Munnuru Kapu Awards | తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ (Nizamabad) శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7న ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు అధ్యక్షుడు తోట రాజశేఖర్ తెలిపారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్ (Inter), ఈఏపీసెట్, జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతియేటా పురస్కారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికీ పలువురు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాజశేఖర్ తెలిపారు.
Munnuru Kapu Awards | క్రీడాకారులకు..
చదువుతో పాటు ఈ ఏడాది క్రీడా రంగంలో సత్తా చాటిన వారిని కూడా సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం 2025-26 లో క్రీడల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన వారు తమ వివరాలను వెంటనే జిల్లా కమిటీకి అందజేయాలని కోరారు. ఇప్పటికీ పేరు నమోదు చేసుకున్న విద్యార్థులు కార్యక్రమానికి తమ తల్లిదండ్రులతో హాజరు కావాలన్నారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్ పటేల్, ప్రధాన కార్యదర్శి రవీందర్ పటేల్ అబ్బాపూర్, కోశాధికారి బాశెట్టి సురేష్ కుమార్ పటేల్ ప్రకటన విడుదల చేశారు.
దీనిని కూడా చదవండి : JEE Advanced Results | “మా విజయానికి మూలం కాకతీయే..!” జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్ల మనోగతం
