అక్షరటుడే, వెబ్డెస్క్ : AE Caught by ACB | పెద్దపల్లి (Peddapalli) మున్సిపల్ ఏఈ సతీష్ ఏసీబీకి చిక్కాడు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రతి పనికి రేటు కట్టి వసూలు చేస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ మంగళవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
AE Caught by ACB | బిల్లుల కోసం..
ఓ కాంట్రాక్టర్ చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మున్సిపల్ ఏఈ సతీష్ రూ.4 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారు నుంచి మంగళవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికకారులు పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
AE Caught by ACB | జోరుగా అవినీతి
రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. పలువురు ఉద్యోగులు ప్రజల నుంచి భారీగా లంచాలు తీసుకుంటున్నారు. ఇంటి అనుమతులు, ఇతర పనుల కోసం డబ్బులు అడుగుతున్నారు. చివరకు బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ కావాలన్నా.. కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Meetings | రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ..కేంద్ర మంత్రులతో వరుస భేటీలు