అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Crime Control | సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకర్లు సహకరించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) కోరారు. మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంకు అధికారులతో గురువారం ఆయన సమన్వయ సమావేశం నిర్వహించాం.
దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు (Cyber Fraud) పెరిగిన విషయం తెలిసిందే. నిందితులు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల ఖాతాలను ఖాళీ చేయడానికి మ్యూల్ అకౌంట్లు తెరుస్తున్నారు. మ్యూల్ అకౌంట్ హోల్డర్లకు కమీషన్ ఆశ చూపుతున్నారు. మ్యూల్ అకౌంట్లు తెరవడంతో పలువురు బ్యాంకు ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. ఇటీవల 32 మంది బ్యాంక్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐ (RBI) రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్తో పాటు 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ప్రతినిధులతో సీపీ సమావేశం నిర్వహించారు.
Cyber Crime Control | భద్రతకు పెద్దపీట వేయాలి
బ్యాంకు అధికారులు ఖాతాల ఓపెనింగ్ టార్గెట్స్ వెంట పడకుండా, కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేయాలని సీపీ సూచించారు. కస్టమర్లు సైబర్ నేరాల బారిన పడకుండా చూడటమే ప్రాథమిక లక్ష్యంగా పని చేయాలన్నారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు ‘సేఫ్ కస్టమర్ చాలెంజ్’ (Safe Customer Challenge)ను బ్యాంకులు స్వీకరించాలన్నారు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు శాఖ ‘జీరో మ్యూల్ అకౌంట్స్’ లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.
దీనిని కూడా చదవండి : Biryani Center Seized | బిర్యానీ సెంటర్ను సీజ్ చేసిన అధికారులు

