అక్షరటుడే, వెబ్డెస్క్: Biryani Center Seized | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆహార కల్తీ ఆగడం లేదు. అనేక పదార్థాలను కల్తీ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మరోవైపు హోటళ్లలో నాసిరకం సరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో ఎంతో మంది అరెస్ట్ అవుతున్నారు. అయినా కల్తీ మాఫియా దందా ఆపడం లేదు. తాజాగా ఎస్వోటీ పోలీసులు (SOT Police) ఓ బిర్యానీ సెంటర్పై దాడి చేశారు.
కూకట్పల్లి (Kukatpally)లోని నసీబ్ బిర్యానీ సెంటర్ (Naseeb Biryani Center)లో పోలీసులు సోదాలు చేశారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల మధ్య వంట చేస్తున్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో వేయించిన ఉల్లిపాయలను తయారు చేయడానికి, ఆ వంటగదిలో వాడిన వంట నూనెను యథాలాపంగా సేకరించి తిరిగి వాడుతున్నట్లు ఇన్స్పెక్టర్లు కనుగొన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కలుషితమైన ఆహార పదార్థాలు ప్రజలకు చేరకుండా అధికారులు సుమారు 1,000 కిలోల పచ్చి ఉల్లిపాయలను, 70 కిలోల వేయించిన ఉల్లిపాయలను ధ్వంసం చేశారు.
Biryani Center Seized | వంట నూనె స్వాధీనం
ఈ దాడిలో సుమారు 480 కిలోల అనుమానాస్పద వంట నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ స్థాయిని నిర్ధారించడానికి, దాని నమూనాలను ల్యాబ్కు పంపారు. అధికారులు ఆ ఆహార కేంద్రాన్ని సీజ్ చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Water Supply | నల్లాకు మోటారు పెడుతున్నారా.. జలమండలి కఠిన చర్యలు

