అక్షరటుడే, వెబ్డెస్క్ : Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)పై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కాంప్రమైజ్డ్ అయిన ప్రధానికి దేశాన్ని నడపడం ఇక సాధ్యం కాదన్నారు.
ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్ (Hyderabad) పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయొద్దని ప్రజలను కోరారు. విదేశీ టూర్లకు వెళ్లొద్దని, పెట్రోల్, డీజిల్, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. విద్యుత్ వాహనాలను వాడాలని, మెట్రోల్లో ప్రయాణించాలని సూచించారు. దీనిపై తాజాగా రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.
Rahul Gandhi | వైఫల్యానికి నిదర్శనం
మోదీ చెప్పిన మాటలు ప్రబోధాలు కావని, వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘12 ఏళ్లలో ఆయన దేశాన్ని ఎంతటి దుస్థితికి తెచ్చారంటే – ఏమి కొనాలి, ఏమి కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అని ప్రజలకు చెప్పాల్సి వస్తోంది. ప్రతిసారీ, వారు తమ జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి బాధ్యతను ప్రజలపైకి నెట్టేస్తున్నారు’’ అని విమర్శించారు.
Rahul Gandhi | ప్రజల్లో ఆందోళన
విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని మోదీ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనని చర్చించుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయెమోనని భయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Work From Home | దేశ ప్రయోజనాల కోసం మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి రావాలి : ప్రధాని Modi పిలుపు

