అక్షరటుడే, వెబ్డెస్క్: Congress Key Meeting | న్యూఢిల్లీ (New Delhi)లోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) , సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జీలు, పీసీసీ అధ్యక్షులతో పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు.
సంస్థాగత పనితీరు, రాజకీయ వ్యూహం మరియు రాబోయే ఎన్నికల సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతదేశంలోని రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోవడంతో, చోటుచేసుకున్న రాజకీయ మార్పులపై సైతం సమీక్షించనున్నట్లు తెలిసింది.
Congress Key Meeting | టీఎంసీపై..

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ను విడిచిపెట్టారు. తాజాగా ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని వార్తలు వస్తున్నాయి. వీటిని ఇప్పటికే టీఎంసీ ఖండించింది. ఈ విషయమై కూడా కాంగ్రెస్ సమావేశంలో చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి..: Nipah Virus Kerala | కేరళలో మళ్లీ ‘నిఫా’ కలకలం.. ఒకరికి పాజిటివ్
