అక్షరటుడే, వెబ్డెస్క్ : Janhvi Kapoor Tirumala | బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె నటించిన పెద్ది సినిమా (Peddi Movie) గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ హిట్ కావాలని ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
జాన్వీ కపూర్ శ్రీవారి భక్తురాలు. ఆమె గతంలో అనేక సార్లు స్వామివారిని దర్శించుకున్నారు. తాజాగా పెద్ది సినిమా విడుదల నేపథ్యంలో బుధవారం అలిపిరి మెట్ల మార్గంలో ఆమె తిరుమల చేరుకున్నారు. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. నటి జాన్వీకపూర్కు టీటీడీ (TTD) అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Janhvi Kapoor Tirumala | ‘పెద్ది’కి పాజిటివ్ టాక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పెద్ది సినిమాను రాంచరణ్ సతీమణి ఉపాసన వీక్షించారు. ప్రీమియర్ షో చూసిన ఆమె అభిమానులతో కలిసి పేపర్లు విసిరారు.
ఆంధ్రప్రదేశ్: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ కపూర్#JanhviKapoor #tirumala #latestnews pic.twitter.com/5qemwK3c44
— Akshara Today | Telugu News (@aksharatoday) June 4, 2026
దీనిని కూడా చదవండి : Ram Charan Peddi | గ్లోబల్ ‘మెగా’ క్రేజ్: రాంచరణ్ ‘పెద్ది’ సినిమా కోసం వచ్చిన జపనీస్ మహిళలు!
