అక్షరటుడే, వెబ్డెస్క్ : Footpath Encroachments | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఫుట్పాత్ ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగిస్తున్నారు.
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ (KPHB Colony) మీసేవ రోడ్డులో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఫుట్పాత్పై ఉన్న టిఫిన్, చికెన్ పకోడి, జ్యూస్ సెంటర్ డబ్బాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఇక్కడ కొన్నేళ్లుగా చిరువ్యాపారులు దందా చేసుకుంటున్నారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. దీంతో శనివారం ఉదయం అధికారులు జేసీబీ సాయంతో ఆక్రమణలను తొలగించారు.
Footpath Encroachments | స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. వాహనదారులు గంటల కొద్ది ట్రాఫిక్లోనే ఇబ్బందులు పడుతుంటారు. దీనికి తోడు పలువురు ఫుట్పాత్లను ఆక్రమించడంతో ప్రజలు రోడ్లపై నడుస్తున్నారు. దీంతో మరింత ఇబ్బందులు తలెత్తున్నాయి. ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officers) ప్రతి శనివారం ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కేపీహెచ్బీలో పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు.
ఇది కూడా చదవండి..: OYO Room Inspections | ఓయో రూముల్లో సీపీ తనిఖీలు..
