అక్షరటుడే, వెబ్డెస్క్: Fish Prasadam Distribution | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exhibition Grounds)లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా సోమవారం రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా, దమ్ము, శ్వాస సంబంధ ఇతర వ్యాధులు నయం అవుతాయనే నమ్మకం ఉంది. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. దీని కోసం తెలుగు రాష్ట్రాలతో దేశా నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చారు. చేప ప్రసాదం కోసం జనం బారులు తీరారు.
Fish Prasadam Distribution | 50 వేల మందికి పూర్తి..

చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కోసం ఫిషరీస్ డిపార్టుమెంట్ 3 లక్షల చేప పిల్లలను తీసుకొచ్చింది. సోమవారం రాత్రి నుంచి నిరంతరయంగా ప్రక్రియ సాగుతోంది. రాత్రి నుంచి ఉదయం వరకు 50 వేలకు మందికి పైగా చేప ప్రసాదం స్వీకరించారు. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులకు స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అవసరాలకు అనుగుణంగా చేప పిల్లలు తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంత్రావు సైతం చేప ప్రసాదం స్వీకరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో
“చేప ప్రసాదం పంపిణీ”నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు 50 వేలకు పైగా చేప ప్రసాదం పంపిణీ..
వీఐపీలు, దివ్యాంగులు, వృద్దులకు స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు…
ఈ రోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్న చేప ప్రసాదం పంపిణీ pic.twitter.com/FjmAoZK094
— Bairaboina Ramesh (@rameshbairaboi1) June 9, 2026
ఇది కూడా చదవండి..: R&B ENC ACB Raids | ఆర్ అంబీ ఈఎన్సీ నివాసాల్లో ఏసీబీ సోదాలు
