Fish Prasadam Distribution | కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fish Prasadam Distribution | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ (Nampally Exhibition Grounds)లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా సోమవారం రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

చేప ప్రసాదం తీసుకుంటే ఆస్తమా, దమ్ము, శ్వాస సంబంధ ఇతర వ్యాధులు నయం అవుతాయనే నమ్మకం ఉంది. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. దీని కోసం తెలుగు రాష్ట్రాలతో దేశా నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చారు. చేప ప్రసాదం కోసం జనం బారులు తీరారు.

Fish Prasadam Distribution | 50 వేల మందికి పూర్తి..

Fish Prasadam Distribution

చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కోసం ఫిషరీస్ డిపార్టుమెంట్ 3 లక్షల చేప పిల్లలను తీసుకొచ్చింది. సోమవారం రాత్రి నుంచి నిరంతరయంగా ప్రక్రియ సాగుతోంది. రాత్రి నుంచి ఉదయం వరకు 50 వేలకు మందికి పైగా చేప ప్రసాదం స్వీకరించారు. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులకు స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అవసరాలకు అనుగుణంగా చేప పిల్లలు తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు. కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంత్​రావు సైతం చేప ప్రసాదం స్వీకరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: R&B ENC ACB Raids | ఆర్​ అంబీ ఈఎన్​సీ నివాసాల్లో ఏసీబీ సోదాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *