అక్షరటుడే, ఇందూరు: Bada Ram Mandir | నగరంలోని (Nizamaba6d City) గాజుల్పేట్ బడా రాంమందిర్కు చెందిన భూముల (Temple Land) కౌలు ప్రక్రియను బుధవారం కంజర జీపీలో పూర్తి చేశారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.
Bada Ram Mandir | రెండేళ్ల కాలపరిమితికి..
ఆలయానికి చెందిన భూములు మోపాల్(Mopal) మండలంలోని కంజరలో 14ఎకరాల 13 గుంటలు ఉండగా బుధవారం ఆ భూముల్లో సాగు కోసం కౌలు ప్రక్రియ నిర్వహించారు. వీటిని రెండేళ్ల కాల పరిమితికి గాను రామర్తి సమత రూ. 17,51,000కు పాటపడి కౌలుకు దక్కించుకున్నారు. జిల్లా దేవాదాయ-ధర్మాదాయ శాఖ (Endowments Department) సహాయ కమిషనర్ విజయ రామారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడా రాంమందిర్ మఠం ఫిట్ పర్సన్ వేణు, తహశీల్దార్ సుజాత రెడ్డి, ఆయా ఆలయాల జూనియర్ అసిస్టెంట్లు ఆంజనేయులు, ప్రశాంత్కుమార్, రఘునాథ్, సుమన్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: TCS Market Value | క్షీణిస్తున్న టీసీఎస్ విలువ.. 21 నెలల్లో సగమైన మార్కెట్ క్యాప్
