అక్షరటుడే, వెబ్డెస్క్: Punjab Political Scenario | పంజాబ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పరిశీలకులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి.
తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ నియామకాలు చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. పరిశీలకులుగా అజయ్ మాకెన్, మీనాక్షి నటరాజన్, భజన్ లాల్ జటావ్లను నియమించింది.

Punjab Political Scenario | సమగ్ర అధ్యయనం
ఈ ముగ్గురు నేతలు పంజాబ్లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, నాయకత్వ సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నారు.
రాబోయే రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాల నేపథ్యంలో పంజాబ్పై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ నియామకాల ద్వారా స్పష్టమవుతోంది.
Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!
