Punjab Political Scenario | పంజాబ్ రాజకీయాలపై స్పెషల్​ ఫోకస్​.. ముగ్గురు ఏఐసీసీ పరిశీలకుల నియామకం

పంజాబ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్​ పార్టీ పరిస్థితులు, నాయకత్వ సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Punjab Political Scenario | పంజాబ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పరిశీలకులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి.

తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ నియామకాలు చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. పరిశీలకులుగా అజయ్ మాకెన్, మీనాక్షి నటరాజన్, భజన్ లాల్ జటావ్‌లను నియమించింది.

congrss

Punjab Political Scenario | సమగ్ర అధ్యయనం

ఈ ముగ్గురు నేతలు పంజాబ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్​ పార్టీ పరిస్థితులు, నాయకత్వ సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నారు.

రాబోయే రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాల నేపథ్యంలో పంజాబ్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ నియామకాల ద్వారా స్పష్టమవుతోంది.

Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *