అక్షరటుడే వెబ్డెస్క్: Rahul Gandhi Student Conferences | నీట్ (NEET-UG) వంటి కీలక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల పక్షాన పోరాడేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) రంగంలోకి దిగారు. బాధితులైన విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు , విద్యావేత్తలను ఏకం చేస్తూ, దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ‘విద్యార్థి సదస్సులను’ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Rahul Gandhi Student Conferences | పోరాట కార్యాచరణ..
యువత గొంతుకగా నిలవడమే లక్ష్యంగా, ప్రముఖ కోచింగ్ కేంద్రాలను వేదికగా చేసుకుని ఈ సదస్సులు జరగనున్నాయి.
జూన్ 17: రాజస్థాన్లోని కోటాలో తొలి సదస్సు.
జులై 10: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రెండో సదస్సు.
జులై 11: బీహార్ రాజధాని పాట్నాలో మూడో సదస్సు.
జులై 14: ఢిల్లీలో భారీ ముగింపు సదస్సు.

Rahul Gandhi Student Conferences | డిమాండ్లు ఇవే..
ప్రభుత్వ అసమర్థత కారణంగా లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ సదస్సుల ద్వారా ప్రధానంగా ఈ కింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు:
పేపర్ లీక్ ముఠాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
పరీక్షల ఫీజుల భారాన్ని పూర్తిగా రద్దు చేయాలి.
నీట్ పరీక్షా విధానంలో పారదర్శకతను పెంచేలా సంస్కరణలు తీసుకురావాలి.
ఈ ఉద్యమంలో భాగంగా ఎన్ఎస్యూఐ (NSUI) , యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లకు వెళ్లి విద్యార్థులను నేరుగా కలుస్తారని, వారి సమస్యలను ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేలా మారుస్తామని వేణుగోపాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad Rain Havoc | హైదరాబాద్లో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి
