అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: House Fire Nizamabad | బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. నగరంలోని(Nizamabad) ఎల్లమ్మగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.
House Fire Nizamabad | ఎల్లమ్మగుట్టలో..
నగరంలోని 45 డివిజన్ కార్పొరేటర్ సుమిత్ర వేణుగోపాల్ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు లేచాయి. అయితే ఆ సమయంలో కార్పొరేటర్ సుమిత్ర ఇంట్లో లేరు. ఇంట్లోని పైఅంతస్తులో ఆమె భర్త వేణుగోపాల్ ఉండగా వెంటనే అగ్ని ప్రమాదాన్ని గమనించిన ఆయన ఫైర్ స్టేషన్ సిబ్బందికి(Fire Department) సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఈ మేరకు నాల్గో టౌన్ పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Suryanarayana) ఆదివారం కార్పొరేటర్ ఇంటికి వెళ్లారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: Penthouse Shed Collapse | పెంట్ హౌజ్పై నుంచి పడిన రేకులు.. ఒకరికి తీవ్ర గాయాలు