IPS Officers Promotion | పలువురు ఐపీఎస్​ అధికారులకు డీజీపీ హోదా

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPS Officers Promotion | రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ (IPS) అధికారులకు పదోన్నతి కల్పించింది. ఆరుగురికి డీజీపీ (DGP) హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

IPS Officers Promotion | ప్రభుత్వం 1995, 1996 బ్యాచ్‌ అధికారులకు..

ప్రభుత్వం 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సీనియర్ IPS అధికారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదాకు (స్థాయి 16 / HAG+) ఎంపిక చేస్తూ, పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో వీరిశెట్టి వెంకట శ్రీనివాస రావు (1995), స్వాతి లక్రా (1995), మహేష్ మురళీధర్ భగవత్ (1995), చారు సిన్హా (1996), అనిల్ కుమార్ (1996), V.C. సజ్జనార్ (1996) ఉన్నారు. పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ అధికారులందరూ తమ ప్రస్తుత పోస్టులలోనే కొనసాగుతారు.

ips 1

దీనిని కూడా చదవండి : Vote Case | ఓటుకు నోటు’ కేసుపై విచారణ.. మరో రెండు వారాల పాటు వాయిదా!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *