అక్షరటుడే, ఎల్లారెడ్డి: Young India School | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ (Young India Integrated School) పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmikantharao) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మద్నూర్ (madnoor) మండల కేంద్రంలో స్కూల్ నిర్మాణ పనులను, డీసీసీ (Kamareddy) అధ్యక్షుడు ఏలె మల్లిఖార్జున్తో కలిసి పరిశీలించారు.
Young India School | పనుల వేగం.. నాణ్యతపై సూచనలు..
అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నిర్మాణ నాణ్యతపై రాజీపడవద్దని తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ స్కూల్ ద్వారా గ్రామీణ విద్యార్థులకు నగర స్థాయి సదుపాయాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన వివరించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, మద్నూర్ ప్రాంతంలో విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందని, విద్యార్థుల భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:IPS Officers Promotion | పలువురు ఐపీఎస్ అధికారులకు డీజీపీ హోదా

