అక్షరటుడే, వెబ్డెస్క్: Allu Arjun Summons | సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు (Nampally Court) సమన్లు జారీ చేసింది. వచ్చే సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
పుష్ప–2 సినిమా ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లో గల సంధ్యా థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హీరో అల్లు అర్జున్ థియేటర్కు రావడంతో ఆయనను చూడటానికి అభిమానులు ఒక్కసారిగా లోపలకి వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడితో పాటు పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Allu Arjun Summons | ఏ 11 గా అల్లు అర్జున్

ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. హీరో అల్లు అర్జున్ ఏ–11గా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు నిందితులు అందరికి సమన్లు జారీ చేసింది. 23 మందిపై ఇప్పటికే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి..: Venky Anil Movie | వెంకీ, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ప్రారంభం