అక్షరటుడే, వెబ్డెస్క్ : NEET Exam Abolition | నీట్ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Tamilnadu CM Vijay) మరోసారి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.
NEET Exam Abolition | ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కారణంగా
నీట్ పరీక్ష తమిళనాడులోని వైద్య విద్యార్థులకు అన్యాయం చేస్తోందని రాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు. అలాగే, విద్యార్థులపై ఏ భాషనూ రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు సంక్షేమానికి సంబంధించిన సమస్యలు రాజకీయ విభేదాలకు అతీతంగా ఉండాలని విజయ్ నొక్కి చెప్పారు. అవకతవకలు, ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కారణంగా మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష (NEET Exam) రద్దు కాగా, జూన్ 21న పునఃపరీక్ష జరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్, ఈ పరీక్షను రద్దు చేయాలని లేదా దాని నుండి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
NEET Exam Abolition | ఐక్యంగా పోరాడాలి

అసెంబ్లీలో మాట్లాడుతూ విజయ్ తమిళనాడు సంక్షేమానికి సంబంధించిన విషయాలపై మనం ఏకమైతే, రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోవైపు, తాను నేరుగా సినీ పరిశ్రమ నుండే రాజకీయాల్లోకి వచ్చానన్న విమర్శలను విజయ్ తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో స్పీకర్ అనుమతితో సినిమాటిక్ లెవల్లో చేయితో సైగ చేస్తూ ప్రసంగం ముగించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Chennai: Tamil Nadu Chief Minister C Joseph Vijay seeks permission from the Speaker and performs a cinematic gesture as he concludes his speech in the State Assembly.
(Video source: Tamil Nadu State Assembly) pic.twitter.com/Y7BlOXHkYI
— ANI (@ANI) June 23, 2026
ఇది కూడా చదవండి..: Ajit Doval BRICS Security | కొత్త భద్రతా సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలి : అజిత్ దోవల్