అక్షరటుడే, వెబ్డెస్క్ : Urea Booking Issues | రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పంటలు వేసే సీజన్ కావడంతో అందరు రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ప్రభుత్వం యాప్ (Fertilizer app) ద్వారా బుకింగ్ విధానం తీసుకు రావడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్కు అవకాశం కల్పించింది. ఎకరాకు రెండు సంచుల యూరియా ఇస్తోంది. అది కూడా విడతల వారిగా.. మండలాన్ని యూనిట్గా తీసుకొని యూరియా సరఫరా చేస్తోంది. ఏ మండలంలోని రైతులు.. అదే మండల పరిధిలో యూరియా బుక్ చేసుకోవాలి.
Urea Booking Issues | 3 కాగానే.. ఫోన్లు పట్టుకొని
యూరియా స్టాక్ రాగానే అధికారులు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే అప్పటికే వందలాది మంది రైతులు ఫోన్లు పట్టుకొని రెడీగా ఉంటున్నారు. అలా ఆన్లైన్లో స్టాక్ అప్డేట్ చేయగానే బుక్ చేస్తున్నారు. దీంతో క్షణాల్లో స్టాక్ అయిపోతుంది. వందల బస్తాలు 30 సెకన్లలోపు బుక్ అవుతున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ లేని, వినియోగించడం రాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 గంటలకు స్టాక్ అప్లోడ్ చేయగా.. ఒక నిమిషం తర్వాత బ్యాగుల సంఖ్య సున్న అని చూపుతోంది.
Urea Booking Issues | భారీగా డిమాండ్
ప్రస్తుతం సీజన్ ప్రారంభం కావడంతో యూరియాకు భారీగా డిమాండ్ ఉంది. ముందు ముందు దొరుకుతుందో లేదోనని, పనులు ప్రారంభం అయితే తెచ్చుకోవడం వీలు కాదని రైతులు ఇప్పుడే బుక్ చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో క్షణాల్లో వేల బ్యాగులు అయిపోతున్నాయి. అయితే మరో వారం, పది రోజులు అయితే యూరియా తిప్పలు తప్పే అవకాశం ఉంది. ఒకసారి బుక్ చేసుకున్న రైతులు రెండో దశ కోసం 15 రోజులు ఆగాల్సి ఉంటుంది. దీంతో రద్దీ తగ్గి అందరికి యూరియా దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం యూరియా కోసం ఆందోళన చెందుతున్నారు.
దీనిని కూడా చదవండి: Minister Seethakka | గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : మంత్రి సీతక్క