అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court | మహిళల పునరుత్పత్తి హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక మహిళ, ముఖ్యంగా మైనర్ బాలిక (Minor girl), తన ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగించాలని ఏ కోర్టు కూడా బలవంతం చేయలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court | తీర్పులోని అంశాలు..
ధర్మాసనం అనుమతి: దాదాపు ఏడు నెలల (28 వారాలు) గర్భంతో ఉన్న 15 ఏళ్ల బాలికకు గర్భస్రావం (Medical Termination) చేసుకునేందుకు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం అనుమతినిచ్చింది. పుట్టబోయే బిడ్డ కంటే, గర్భం దాల్చిన మహిళ లేదా బాలిక నిర్ణయానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు పేర్కొంది.
భవిష్యత్తుపై ప్రభావం: ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించడం వల్ల ఆ మైనర్ బాలిక మానసిక ఆరోగ్యం, విద్య, సామాజిక స్థితిగతులు , భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఒక మహిళ తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వయంప్రతిపత్తిని కలిగి ఉండాలని, ఆమెను బలవంతం చేయడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి..: Amit Shah | దీదీకి రాష్ట్రంలోనే చోటు లేదు.. ఇక ఢిల్లీకి ఎలా వస్తారు?: అమిత్ షా

