అక్షరటుడే, వెబ్డెస్క్: Charminar ACP Wife | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (Malkajgiri District) అల్వాల్ విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు.
చార్మినార్ ఏసీపీగా పని చేస్తున్న చంద్రశేఖర్ తన భార్య హేమలత (50)తో కలిసి అల్వాల్లోని సాయిబాబానగర్ కాలనీలో ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాయి. కుమారుడు చంద్రహాస్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో హేమలత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చంద్రశేఖర్ ఫోన్ చేసిన ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో.. వెంటనే కుమారుడికి ఫోన్ చేశాడు.
Charminar ACP Wife | అనారోగ్య సమస్యలతో..

చంద్రహాస్ ఇంటికి వెళ్లి చూసే సరికి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. ఆమె ఫ్యాన్కు ఉరి వేసుకొని ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తన తల్లి కడుపు, వెన్నెముక సంబంధమైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు చంద్రహాస్ తెలిపారు. ఆ బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Rain Forecast | రైతులకు గుడ్ న్యూస్.. 16 నుంచి రాష్ట్రానికి వర్ష సూచన