అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Oora Panduga | నగరంలో(Nizamabad City) ఆగస్ట్ 2న ఊర పండుగను నిర్వహించనున్నట్లు సర్వసమాజ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ(Former MLA Yendala Lakshminarayana) పేర్కొన్నారు. నగరంలోని సిర్నపల్లి గడిలో ఆదివారం కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
Oora Panduga | అంగరంగం వైభవంగా..
ఆయన మాట్లాడుతూ..ఊర పండుగలో భాగంగా జూలై 30న బండారు పోసే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏడాదిలాగే ఊర పండగను అన్ని కులాల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఖిల్లా వద్ద అమ్మవార్ల గద్దెలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మున్సిపల్, పోలీస్శాఖ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. సర్వ సమాజ్ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్ మాట్లాడుతూ.. కార్యక్రమం ఆసాంతం పక్కాగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్వ సమాజ కమిటీ కో కన్వీనర్ ఆదె ప్రవీణ్, కౌడపు శరత్, బంటు బలరాం, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.