అక్షరటుడే, వెబ్డెస్క్: NEET Paper Leak | నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏకు సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్ తర్వాత సంస్కరణల పురోగతిపై నివేదిక కోరంది. వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
నీట్-యూజీ పరీక్షకు సంబంధించి జరుగుతున్న ‘తప్పుల పరంపరకు’ ముగింపు పలకాలని, కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారేందుకు గల ప్రణాళికల వివరాలను తెలియజేయాలని ధర్మాసనం సేర్కొంది. నీట్ పేపర్ లీకుల అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పి.ఎస్. నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం తాము ఈ విషయాన్ని చాలా నిశితంగా పర్యవేక్షిస్తామని, క్రమం తప్పకుండా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
NEET Paper Leak | డేటాను ఎలా పరిరక్షిస్తారు
పూర్తిగా ఆన్లైన్ విధానానికి మారడానికి ఏం చేస్తున్నారో చెప్పాలని కోర్టు పేర్కొంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారినప్పుడు డేటాను ఎలా పరిరక్షిస్తారని ప్రశ్నించింది. భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, పిల్లల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పది రెట్లు ఎక్కువగా కృషి చేస్తోందని అన్నారు. పూర్తి వివరాలు సమర్పించడానికి సమయం కావాలని ఆయన కోరారు. దీంతో కోర్టు విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి..: CJP Protest | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు ఆపేది లేదు: సీజేపీ