Social Media Summons | యూజర్ల డేటా భద్రతపై కేంద్రం సీరియస్.. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు!

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి పలు సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Social Media Summons | ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి పలు సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. డేటా ప్రైవసీ , వ్యక్తిగత భద్రతా నిబంధనలపై ఆయా సంస్థలు వివరణ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల భద్రత కోసం, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, రైతులు, కార్మికులు వంటి వివిధ వర్గాల ప్రజా భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని కోరింది.

Social Media Summons | సమావేశానికి గల ప్రాధాన్యం..

ఈ మేరకు ఆగస్టు 3న సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియా ప్రతినిధులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఇదే సమయంలో, నీట్ యూజీ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల నిరసనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ఇది కూడా చదవండి:  Kamareddy Rain | కామారెడ్డిలో భారీ వర్షం.. రైతుల్లో ఆనందం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *