Kerala Landslides | భారీ వర్షాలతో కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు దుర్మరణం..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kerala Landslides | కేరళ (Kerala)లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండో చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగి పడడంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.

Kerala Landslides | ఇడుక్కి జిల్లాలో..

ఇడుక్కి జిల్లాలోని ఎత్తైన ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక మహిళ ఇంటిపై పడటంతో ఆమె మృతి చెందింది. అలాగే శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు తెలిపారు.

Kerala Landslides | కొట్టాయం జిల్లాలో..

కొట్టాయం జిల్లాలోని పూంజర్‌లోని పయ్యనితోట్టంలో కొండచరియలు విరిగిపడడంతో మరో యువకుడు మృతి చెందాడు. అతని తల్లి శిథిలాల కింద కూరుకుపోయింది. మృతుడిని జానీ కుమారుడు జోసెఫ్‌గా గుర్తించామని, శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటుందని అనుమానిస్తున్న అతని తల్లి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

వాగమన్‌ ప్రాంతంలో..

ఇడుక్కి జిల్లాలోని వాగమన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక ఇంటిపై పడడంతో, అందులో ఒక వ్యక్తి చిక్కుకుపోయినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాలు రహదారిని అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Meta India FIR | మెటా భారత విభాగాధిపతిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్పందించిన సంస్థ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *