అక్షరటుడే, డిచ్పల్లి: బ్రెయిన్ స్ట్రోక్తో (Brain Stroke) హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన ధర్పల్లిలో చోటు చేసుకుంది.
Brain Stroke | అనారోగ్యంతో బాధపడుతూ..
ధర్పల్లి (Dharpally) పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా (Head Constable) పనిచేస్తున్న ఎస్.నర్సయ్య శనివారం రాత్రి బ్రెయిన్ స్టోక్తో మృతి చెందారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి శనివారం స్ట్రోక్ రావడంతో శనివారం మృతి చెందారు. దీంతో కానిస్టేబుల్ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. ధర్పల్లి ఎస్సై, పోలీస్స్టేషన్ సిబ్బంది (Dharpally police) ప్రగాఢ సానుభూతి తెలిపారు. సౌమ్యుడిగా పేరున్న ఆయన అకాలమరణం (Nizamabad News) చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సయ్యకు నివాళులర్పించారు.

ఇది కూడా చదవండి: SI Suspended | అన్న అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్సై.. సస్పెండ్ చేసిన అధికారులు

