Jaspal Singh BJP | బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్ నియామకం

నిజామాబాద్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్‌ నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ: Jaspal Singh BJP | నిజామాబాద్ (Nizamabad BJP) జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ జిల్లా నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Jaspal Singh BJP | పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా..

నూతనంగా ఎంపికైన జస్పాల్ సింగ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన బీజేపీ అధిష్టానానికి, ఎంపీ ధర్మపురి అర్వింద్​, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి ధన్యవాదాలు తెలియజేశారు. ​రానున్న రోజుల్లో పార్టీ ఆదేశానుసారం జిల్లాలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ, బీజేపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి, పార్టీ అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా: వాంగ్​ చుక్​ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *