అక్షరటుడే, బోధన్: Student Goals | విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని జిల్లా యువజన క్రీడల అధికారి పవన్కుమార్ అన్నారు. పట్టణంలోని టీజీఎంఆర్ఎస్ (TGMRS) అండ్ జేసీ గర్ల్స్–1లో శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వెల్ఫేర్ వీక్ కార్యక్రమం భాగంగా ‘స్ల్పాష్ సమ్మర్ క్యాంప్’ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీవైఎస్వో హాజరై మాట్లాడారు.
Student Goals | లక్ష్యం లేని చదువు.. గందరగోళం
డీవైఎస్వో మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యం లేకుండా చదివితే గందరగోళానికి గురవుతారన్నారు. ఈ సందర్భంగా టీజీఎంఆర్ఎస్ బాల్కొండ విద్యార్థినులు (Balkonda Students) ప్రదర్శించిన పిరమిడ్ ప్రదర్శన అబ్బురపర్చింది. విద్యార్థుల్లో ఉన్న క్రమశిక్షణ, జట్టు ఐకమత్యాన్ని వారు పిరమిడ్ రూపంలో ప్రదర్శించారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వెల్ఫేర్ వీక్లో భాగంగా స్టూడెంట్ టాలెంట్ ఫెస్ట్ నిర్వహించారు.
ఇందులో డ్రాయింగ్, క్విజ్, ఉర్దూ, ఇంగ్లిష్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి విన్నర్స్, రన్నర్స్కు బహుమతులు ప్రదానం చేశారు. కళాశాలలో ఫస్ట్, సెకండ్ ఇయర్లో టాపర్లను వారి తల్లిదండ్రులతో కలిసి సన్మానించారు. అనంతరం ప్రిన్సిపల్ పద్మజను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సంగీత్ రావు, టీఎంఆర్ఐఈఎస్ నిజామాబాద్ రీజినల్ లెవల్ కోఆర్డినేటర్ అబ్దుల్ బషీర్, విజిలెన్స్ అధికారి షేక్ అహ్మద్ జియా,ఎండీ హమీద్ హాజరయ్యారు.
ఇది కూడా చదవండి..: Malaria Awareness | ఎల్లారెడ్డిలో ప్రపంచ మలేరియా డే అవగాహన ర్యాలీ

