అక్షరటుడే, వెబ్డెస్క్ : Uppal Chowrasta | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఉప్పల్ చౌరస్తాను అధికారులు ఆదివారం నుంచి బంద్ చేశారు. ఎలివేటెడ్ కారిడార్ (Elevated Corridor) పనులు కొనసాగుతున్నందున తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఉప్పల్ రింగ్రోడ్డు నుంచి హన్మకొండ, వరంగల్ (Warangal) వైపు వెళ్ళే బస్సులు ఆగే బస్టాండ్ను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్కు మార్చినట్లు తెలిపారు. నేటి నుంచి అక్కడే బస్సులు ఆగుతాయని పేర్కొన్నారు. బోడుప్పల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుంచి భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచించారు.
Uppal Chowrasta | హబ్సీగూడా ద్వారా..
సికింద్రాబాద్ (Secunderabad) నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ నుంచి నాచారం ద్వారా చెంగిచర్ల చేరుకుని అక్కడి నుండి జాతీయ రహదారికి వెళ్లాలి. చిన్న వాహనాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుంచి రహదారికి చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజులు ఉంటాయో, పనులు ఎన్నటికి పూర్తి చేస్తారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా చౌరస్తా బంద్ చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

దీనిని కూడా చదవండి : Footpath Encroachments | హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగింపు

