అక్షరటుడే, వెబ్డెస్క్: Delhi High Court | ఢిల్లీ హైకోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రాజధానిలోని అనేక ఇతర ప్రదేశాలకు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు మధ్యాహ్నం 2:11 గంటలకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను పేల్చివేయండి అని బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఖలిస్తాన్ పేరుతో పంపిన ఈ ఇమెయిల్లో, నగరంలోని పలు ప్రదేశాలను పేల్చివేయడానికి సంబంధించిన ప్రణాళికల వివరాలు ఉన్నాయి. జామ్నగర్ హౌస్, ఝండేవాలన్ భవనం, సాకేత్ కార్యాలయం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్ 3, మరియు ఢిల్లీ కంటోన్మెంట్లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) కార్యాలయంతో సహా మరో ఆరు ప్రదేశాలకు ఈ బెదిరింపు అందింది.
Delhi High Court | పోలీసుల తనిఖీలు
బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఈ బెదిరింపును తీవ్రంగా పరిగణించారు. అన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సాయంతో సోదాలు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. కాగా రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇప్పటికే దేశ రాజధానిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..: Karur Stampede Case | కరూర్ బాధితులకు బిగ్ రిలీఫ్ .. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే!