అక్షరటుడే, వెబ్డెస్క్ : Fuel Shortage | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది. ఇంధనం దొరకదనే వార్తలు, కొరత ఉందని ప్రచారం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురై అధిక మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్రోల్ బంక్ (Petrol Bunk)ల్లో నిల్వలు అయిపోయి నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.
వాహనదారులు పెట్రోల్ బంక్లకు బారులు తీరడంతో .. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల బంక్ల్లో స్టాక్ అయిపోయింది. దీంతో నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చాలా బంకుల్లో డీజిల్ కొరతో వాహనదారులు, రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం యాసంగి పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. హార్వెస్టర్కు భారీగా డీజిల్ అవసరం. ఈ క్రమంలో డీజిల్ దొరక్క కోత మిషన్లు నడవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Fuel Shortage | పరిమితంగా..
విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం, కర్నూలు జిల్లాల్లో తీవ్రంగా ఇంధన సమస్య ఉంది. లీటర్ పెట్రోల్ కోసం గంటల తరబడి ప్రజలు లైన్లో ఉంటున్నారు. కొన్ని బంకుల్లో టూవీలర్లకు రూ.200-300, కార్లకు రూ.వెయ్యి మాత్రమే పోస్తామంటూ నిబంధనలు పెడుతున్నారు. పరిమితంగా పోస్తుండటంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Fuel Shortage | కొరత లేదు…
తెలంగాణలో ఇంధన కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమృద్ధిగానే ఉన్నాయని వెల్లడించారు. వినియోగదారులు ఎలాంటి అపోహలకు గురి కావొద్దని కోరారు. ఏమైనా అనుమానాలు ఉంటే 1967 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ (Black Market) చేస్తే కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: BRS Formation Day | నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. వేడుకలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన తెలంగాణ భవన్

