Petrol Shortage | కామారెడ్డిలో పెట్రోల్​ బంక్​లు బంద్​.. కొరతే కారణమంటున్న నిర్వాహకులు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Petrol Shortage | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. రాష్ట్రంలో కూడా ఎక్కడా పెట్రోల్ (petrol bunks), డీజిల్ కొరత లేదు. అయితే అనూహ్యంగా సోమవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

Petrol Shortage | సాయంత్రం నుంచి నోస్టాక్​..

పట్టణంలో (kamareddy news) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి కొరత లేకుండా కొనసాగిన పెట్రోల్ బంకులు సాయంత్రం నో స్టాక్ అంటూ మూసివేశారు. దాంతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం కామారెడ్డి పట్టణం మొత్తం చక్కర్లు కొట్టారు. నిజాంసాగర్​ చౌరస్తాలో ఉన్న ఒకే ఒక్క పెట్రోల్​ బంక్​లో పెట్రోల్​ డీజిల్​ ఉండడంతో వాహనదారులు క్యూ కట్టారు. మరికొందరు మళ్లీ పెట్రోల్ కొరత ఎక్కడ వస్తుందోనని వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకుని బాటిల్స్​లో సైతం పెట్రోల్ వేసుకుని వెళ్లారు. పెట్రోల్ కొరతకు కారణాలను బంక్​ సిబ్బంది వద్ద ఆరా తీయగా నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు ఉండడంతో పెట్రోల్, డీజిల్ కోసం డీడీలు చెల్లించలేదని తెలిసింది. వరుసగా రెండు రోజులు బ్యాంకులు సెలవు కావడమే పెట్రోల్, డీజిల్ కొరతకు కారణమని సిబ్బంది పేర్కొన్నారు. నేడు బంక్​ల యాజమాన్యాలు డీడీలు చెల్లించేందుకు క్యూ కట్టారని, నేటి రాత్రి వరకు పెట్రోల్, డీజిల్ చెల్లించే అవకాశం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: KTR on Kavitha Party | కవిత పార్టీపై కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *