అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganja Seizure | జిల్లా కేంద్రంలోని (Kamareddy) రైల్వే స్టేషన్లో (Railway Station) ఎక్సైజ్, రైల్వే టాస్క్ఫోర్స్ (Railway Task Force) పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఎండు గంజాయి పట్టుబడింది.
Kamareddy Ganja Seizure | సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న రైలులో..
సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు స్టేషన్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. తనిఖీలో బ్యాగులో 2 కిలోల చొప్పున నాలుగు ప్యాకెట్లు, మరో కిలో ప్యాకెట్ కలిపి మొత్తం 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. పట్టుబడిన నిందితుడిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కిషన్ పటేల్గా గుర్తించారు.
తన స్నేహితుడికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నానని నిందితుడు చెబుతున్నప్పటికీ, విక్రయించేందుకే తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ తెలిపారు. ఈ దాడులలో ఆర్పీఎఫ్ ఎస్సై జి. వెంకటేశ్వర్లు, ఏఎస్సై పి. రవీంద్రబాబు, సిబ్బంది బయ్యాలు, బాలా సాహెబ్, చంద్రశేఖర్, మీనాక్షి, శివాని, ఎక్సైజ్ ట్రైనీ ఎస్సైలు శ్రీనివాస్, మధు, అనిల్, రచన, సిబ్బంది ఫరీద్, పవన్, బాబు, రాజు, దినేష్, రమ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కేంద్రం ముందు మోకరిల్లిన రేవంత్ సర్కార్